CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎండిపోతున్న హరితహారం మొక్కలు.మొక్కల పెంపకం లో నిర్లక్ష్యం.నిరుపయోగంగా రెండు వాటర్ ట్యాంకులు.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం పచ్చదనాన్ని పెంచేందుకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఇ ఎవెన్యూ ప్లాంట్. కార్య క్రమంలో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు. జాతీయ రహదారిపై ఏర్పాటుచేసిన డివైడర్ లో లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటుచేసిన మొక్కలు సైతం. మొక్కలకు నీళ్లు పట్టకపోవడంతో వేసవి కాలం కావడం మొక్కలు పూర్తిగా ఎండిపోతున్నాయి. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. మొక్కల సంరక్షణకు వాచర్లు నియ మించి గ్రామ పంచాయతీలకు, రెండు వాటర్ ట్యాంకులు కొనుగోలు చేసినప్పటికీ నిర్లక్ష్యం చేయడం మూలంగా మొక్కలు ఎండిపోయి లక్షలాది రూపాయలు నీళ్ళ పాలయిన చందంగా తయారైంది ములుగు జిల్లా లో 2020 -21 సంవత్సరం లో 9 మండలాల లో అవెన్యూ ప్లాంటేషన్ పేరుతో రహదారులకు ఇరువైపులా రూపాయలు 22. 30 కోట్లతో 1.17 లక్షల మొక్కలు నాటారు 246 ప్రదేశాలలో మొక్కలు నాటి నప్పటికీ చాలా చోట్ల సంరక్షణ నిర్లక్ష్యం మూలంగా మొక్కలు పూర్తిగా ఎండి పోవడం జరిగింది కొన్ని చోట్ల మొక్కలకు ట్రీ గార్డ్ కూడా ఏర్పాటు చేయలేదు అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీ గాడ్స్ లేకపోవడం సమయానికి నీరు పట్టకపోవడం మొక్కలు వంగిపోవడం చనిపోవడం లాంటివి దర్శనమిస్తున్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన మొక్కలను సంరక్షించడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకొని హరితహారం మొక్కలను సంరక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Share it:

TS

Post A Comment: