మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం వేదాంతపురం గ్రామంలో ఆదివాసి నాయకపోడులు నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి జాతర మహోత్సవంలో భాగంగా సండ్ర చెట్లు తేవడం కోసం అడవికి బయలు దేరిన వేదాంత పురం ఆదివాసీ నాయకపోడు భక్తులు. గిరిజనేతర భక్తుల సైతం ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఈ సందర్బంగా సర్పంచ్ సోమిని శివ శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ శుక్రవారం నిప్పుల గుండాలపై నడిచే కార్యక్రమం నిర్వహణ ఉంటుందని, దానికోసం సరువులు (సండ్ర చెట్లు) పట్టుకొని రావడానికి క్షేమంగా తిరిగి రావాలని స్వామి కి మొక్కి ట్రాక్టర్లుతో అడవికి చేరుకోవడం జరుగుతుందని, అక్కడ మూడు గ్రూప్ లుగు విడిపోయి మూడు సరువులు (సండ్ర చెట్లను) వ్రేలతో సహా పెకిలించుకు రావడం జరుగుతుందని. అదేవిదంగా అడవిలోకి వెళ్లిన భక్తులందరూ విందు భోజనాలు ముగించుకుంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, పెద్దలు, భక్తులు అనేక మంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: