మన్యం టివి దుమ్ముగూడెం:: భద్రాచలం పట్టణంలోని కహాల్ అనాధ ఆశ్రమానికి దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నర్సిరెడ్డి ,అన్నపూర్ణ దంపతుల కుమారుడు నాగ కౌశిక్ రెడ్డి ,రాజమండ్రి లో మెడికల్ కాలేజీలో ఎం. బి. బి .ఎస్. పూర్తిచేసుకుని అమెరికా లో ఎండి చేయుటకై సీటు వచ్చినందుకు గాను చదువుకునే అనాధ పిల్లలకు ఏదో ఒక చిన్న సహాయం చేద్దామని సంకల్పంతో ఈరోజు క హాల్ అనాధ ఆశ్రమానికి వచ్చి 10000 రూపాయలు విరాళంగా అందించారు.మళ్లీ తిరిగి రెండు సంవత్సరాల తర్వాత భద్రాచలం వస్తానని అప్పుడు కూడా వీరికి ఎంతో కొంత సహాయం చేస్తానని చెప్పారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆశ్రమం నిర్వాహకులు వేణు, హరి, వెంకట్ ,కడాలి నాగరాజు విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: