మన్యం టివి దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం లోని కల్యాణ లక్ష్మి చెక్కులు అందుకున్న బాధితులు బ్యాంక్ అధికారులు చేస్తున్న వేధింపులను భద్రాచలం ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు మండల పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే నర్సాపురం ఏపీజీవీబీ బ్యాంకు లో టిపిసిసి నెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ తో బ్యాంక్ ను సందర్శించారు బ్యాంక్ మేనేజర్ పై మండిపడ్డారు కల్యాణ లక్ష్మి చెక్కులు బ్యాంక్ అధికారులు నిలుపుదల చేయడం సరికాదని కళ్యాణ లక్ష్మి పైసలు వాళ్ళ అకౌంట్లో రిలీజ్ చేయాలని ఆదేశించారు. ప్రజలని పొదుపు, వ్యవసాయ అప్పు ఉంటే వేరే విధంగా జమ చేయాలని కానీ రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి వస్తే వాటిని అప్పు రూపంలో జమచేయారదని సందర్భంగా తెలిపారు. బ్యాంకు అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా బాధితులు ఎమ్మెల్యే పొందేం వీరయ్య ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తోటమల్ల సంగీతారావు, నారాయణ మూర్తి, కనుబుద్ది దేవా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: