మన్యం టీవీ దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం నరసాపురం గ్రామం లో సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు రావులపల్లి రామ్ ప్రసాద్ ,రావులపల్లి రవి కుమార్ మాతృమూర్తి సుశీల గారి దశదినకర్మ హాజరై పూలమాలవేసి నివాళులర్పించిన రాజకీయ ప్రముఖులు ఈ సందర్భంగా భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఆమె చిత్రపటానికి పూలమాలవేసి సంతాపం తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు, పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్సీ సిపిఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరావు సుశీలమ్మ గారికి నివాళులర్పించి రావులపల్లి కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా దుమ్ముగూడెం టిఆర్ఎస్ నాయకులు మండల అధ్యక్షులు అన్నే సత్యాలు ,ప్రధాన కార్యదర్శి కణితి రాముడు ,భద్రాచలం అధ్యక్షుడు తిరుపతి రావు ,కాంగ్రెస్ నాయకులు టిపిసిసి మెంబెర్ నల్లపు దుర్గాప్రసాద్, రంగారావు ,సంగీతారావు, కనుబుద్ది దేవా తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: