మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండలంలోని భట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కొమ్ముగూడెం గ్రామానికి ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు చొరవతో భద్రాచలం ఐటిడిఏ 2లక్షల నిధులతో బోరు నిర్మాణ పనులను కరకగూడెం మండల ఎంపిపి రేగా కాళిక చేతుల మీదగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వం విప్, రేగా కాంతారావు కి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచు తోలెం నాగేశ్వర రావు,మండల ఎంపిడిఓ దారవాత్ శ్రీనివాస్,సెక్రెటరీ శ్రీజ,గ్రామస్థులు పాయం శంకరయ్య,పాయం వెంకటేశ్వర్లు,వట్టం సమ్మయ్య,దాట్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: