మన్యం మనుగడ, పినపాక
ములుగు జిల్లా మంగపేట మండలం శనగ కుంట గ్రామంలో ఇటీవల అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారిన కుటుంబాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, పాత రెడ్డిపాలెం పంచాయతీ పరిధిలోని చింతల బయ్యారం గ్రామ శివాలయం తరుపున బుధవారం రూ 54 వేల రూపాయల విలువగల నిత్యావసర సరుకులు,బట్టలు, బకెట్లు,కూరగాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో కంటిపూడి వెంకన్న బాబు, పొనగంటి శివకృష్ణ, తోట బాలకృష్ణ ,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: