మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీ పోతిరెడ్డి పల్లి గ్రామం నందు ముస్లిం మైనార్టీ నూతనంగా నిర్మిస్తున్న మసీదు భవనాన్ని పరిసర ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు సందర్శించారు. అనంతరం ముస్లిం మైనార్టీ పెద్దలు ఆయనను ఘనంగా శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యల మీద వినతి పత్రం అందజేశారు, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, ముస్లిం మైనారిటీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: