CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బస్ డిపో,రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటుకు కదంతొక్కిన ప్రజా సంఘాలు.జాతీయ రహదారిపై ధర్నా రాస్తారోకో.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరునాగారం కేంద్రంగా బస్ డిపో,రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ఆదివారం బస్టాండ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై సాధన సమితి కమిటీ కన్వీనర్ వావిలాల స్వామి ఆధ్వర్యంలో ధర్నా,రాస్తారోక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమా నికి హాజరైన ప్రజా సంఘాల నాయకులు గంపల శివ కుమార్,సాంబశివరావు, దావూద్,జాడీ రామరాజు నేత, సర్వర్,చిటమట రఘులు మాట్లాడుతూ.1983 సంవత్స రం నాటి నుండి నేటి 2022 వరకు కూడా పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఈ మారుమూల ఏటూరునాగారం అలాంటి ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోక కుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండడం,జరుగు తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మూడు రాష్ట్రాల సరి హద్దు ప్రాంతాలకు కేంద్ర బిందు వు గా ఉన్న ఏటూరు నాగారం ప్రాంతంలో అభివృద్ధిని మర్చి పోవడం జరిగిందన్నారు.

ములుగు జిల్లా ఏర్పడడంతో జిల్లాలో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఏటూరునాగారం కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ప్రకటించకుండా ఈ ప్రాంత అభివృద్ధి పై సవతి తల్లి ప్రేమ వలక పోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇప్పటికైనా పాలకులు డిపో ఏర్పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్య క్రమంలో సాధన సమితి నాయకుల పేయ్యల కృష్ణ,సురేష్,రాజు,రమేష్,సామేలు,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: