నృసింహ సేవావాహిని ఐదవ వార్షికోత్సవం సందర్బంగా ఈరోజు సుమారు ఐదు వెల మందికి అన్నప్రసాదాన్ని అందివ్వడం జరిగింది. ఈసందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు డా. కృష్ణ చైతన్య మాట్లాడుతూ నృసింహ సేవావాహిని సంస్థ స్థాపించిన నాటి నుండి నేటి వరకు సభ్యుల సహకారం తో ఎన్నో ఆధ్యాత్మిక, సామజిక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, కరోనా కష్ట కాలంలో సంస్థ ఆధ్వర్యంలో కొన్ని లక్షల మందికి అన్నార్తిని తీర్చామని గత నాలుగు సంవత్సరాలనుండి పేదింటి పెద్ద కొడుకులా ఆపద అంటే సంస్థ సభ్యులు ముందుకొచ్చి సహాయం చేయడం చాలా ఆనందం గా ఉన్నదని నేడు సంస్థ ఐదవ వార్షికోత్సవo సందర్బంగా భక్తులకు అన్నప్రసాదాన్ని అందించామని అన్నారు, అందులో భాగంగానే అహోబిలం, భద్రాచలం, కదిరి,మంగళగిరి, అనంతపురం, యాడికి, సింహాచలం లో అన్నప్రసాదాన్ని అందించడం జరిగినది.భవిష్యత్ లో ఉభయ తెలుగు రాష్ట్రాలలో తమ సేవలను విస్తృతం చేయనున్నామని ఆ లక్ష్మీనారసింహుడు అనుగ్రహం తో సంస్థ స్థాపన నుండి నేటి వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సేవా మార్గంలో నడుస్తున్న సంస్థ సభ్యులందరికి ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సంస్థ వ్యవస్థాపకులు శ్రీ మాన్ శ్రీ డా. కృష్ణ చైతన్య, ఇతర నృసింహ సేవావాహిని బృందం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: