మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఐలాపురం బ్రిడ్జి సమీపంలో కారు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఇర్పా కృష్ణ పాల్వంచ వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి అదే సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచు కోనడంతో ఎటువంటి గాయాలు కాలేదు, కానీ కారు లోయలోకి పల్టీలు కొట్టింది. గాయాలపాలైన కృష్ణ ను పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి, మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా భద్రాచలం లో మరణించాడు. కృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.పాల్వంచ లో నివాసం ఉంటున్న అతడు స్వగ్రామానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Post A Comment: