దమ్మపేట మే 28 ( మన్యం మనుగడ ) : ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి ఆధ్వర్యంలో ఈరోజు దమ్మపేట లో విలేఖరుల సమావేశం జరిగింది ఎమ్మార్పీఎస్ ఎమ్మెస్సీ రాష్ట్ర కార్యదర్శి అశ్వరావుపేట నియోజవర్గ నియోజవర్గ ఇంచార్జ్ కొలికిపోగు కాంతారావు ఆధ్వర్యంలో సదస్సు జరిగింది ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ దశాబ్దాలుగా ఉద్యమం సాగుతున్న కేంద్ర ప్రభుత్వం వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట నిలబెట్టుకోలేకపోయింది 26-05-2022న ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్ నరసింహ గారిని ఎస్సీ వర్గీకరణ సాధన పై కలవడం జరిగింది ఆయన ఈసారి తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారు ఈసారి ఇవ్వకపోతే ఢిల్లీ పార్లమెంట్ ముట్టడిస్తాం అని డిమాండ్ చేశారు జూన్ 4వ తేదీన భద్రాచలంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి జిల్లా కోఆర్డినేటర్ దేపంగి రమణయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ బచ్చలకూరువెంకటేశ్వర మాదిగ పాల్గొంటారు ఈ సమావేశానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు రావూరి వీరయ్య మాదిగ రాయల పుల్లారావు మాదిగ జిల్లా కార్యదర్శి కోలేటి పకీరయ్య మాదిగ బండ్ల లక్ష్మయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు కొలికీ పోగు ముసలయ్య మాదిగ పాల్గొన్నారు
Post A Comment: