మన్యం మనుగడ కరకగూడెం:కరకగూడెం మండల పరిధిలోని పెట్రోలు బంకుల్లో ఇక నుండి వాహనాదరులు హెల్మెట్, నంబర్ ప్లేటు ఉంటె తప్ప లేనివారికి పెట్రోలు కొట్టకూడదని కరకగూడెం ఎస్ఐ నాగ బిక్షం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలకు నెంబరు ప్లెట్ లేకపోయినా ద్విచక్ర వాహన దారుడు హెల్మెట్ పెట్టుకోకపోయినా పెట్రోలు కొట్టకూడదని, బంకులు వద్ద పోస్టర్లు ఏర్పాటు చేయాలని బంకు యజమానులకు ఆయన సూచించారు. ద్విచక్ర వాహనదారుడు కచ్చితంగా హెల్మెట్ ధరించి తిరగాలని నూతన వాహనాలకు,పాత వాహనాలకు నెంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని లేనిపక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఆయన అన్నారు ప్రమాదాల నిర్వహించడంలో ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రైటర్ దుర్గారావు,ఏఎస్ఐ పాపయ్య పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: