మన్యం టీవీ మణుగూరు:
మంగపేట మండలం, నరసింహసాగర్ గ్రామ పంచాయితీ శనగకుంట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 32 ఆదివాసీ కుటుంబాలకి అండగా లయన్స్ క్లబ్ అశ్వాపురం,మణుగూరు శాఖలు ముందుకి వచ్చారు.ఈ మేరకు ఆదివారం లయన్స్ క్లబ్ అశ్వాపురం,మణుగూరు శాఖల సహకారంతో తమ వంతుగా లయన్స్ క్లబ్ తరపున ఒక్కో కుటుంబానికి రెండు వేల రూపాయల నగదును,ప్లేట్స్, బట్టలను,శనగకుంట గ్రామ అగ్ని ప్రమాద భాదిత కుటుంబాలకి అందజేశారు. ఆపదలో తమకి అండగా ఉన్న లయన్స్ క్లబ్ వారికి శనగకుంట బాధిత కుటుంబాలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అశ్వాపురం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సుంకరి.సురేందర్, సభ్యులు కొండల్ రావు,కమటం నరేష్,సింహాద్రి సుధాకర్,వర్మ రాజు,మణుగూరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, సెక్రెటరీ గాజుల పూర్ణ చందర్ రావు,శ్రీనివాసరావు,భాగం రమేష్,ఇతర సభ్యులు శక్తి చలనం దిన పత్రిక సియండి గంట రాధ,వుదయం దినపత్రిక రిపోర్టర్ యం.డి ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: