మన్యం మనుగడ, అశ్వారావుపేట:అశ్వారావుపేట నియోజకవర్గ పర్యటనకు విచ్చేసిన తెలంగాణ దేవాదాయ, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఇంద్రకిరణ్ రెడ్డిని దమ్మపేట మండలం అప్పారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వద్ద శాలువాతో సత్కరించి మెమెంటో అందజేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. అనంతరం ఆయనతో అశ్వారావుపేట మండలం లోని 30 పంచాయతీలలో 5 పంచాయతీల లో గల ఫారెస్ట్ దమ్మపేట రేంజ్ లోకి వెళ్లిందని దాని వలన కొంచం ఇబ్బందులు పడుతున్నారని కావున వెంటనే ఆ 5 పంచాయతీలను అశ్వారావుపేట లో కలపాలని వినతి పత్రం అందజేశారు. దానికి మంత్రి ఇంద్రకిరణ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయనతో కలిసి ఫ్యాక్టరీని సందర్శించి ఆయిల్ ఫామ్ సాగు గురించి మంత్రికి తెలియజేశారు.
Navigation
Post A Comment: