CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వీఆర్ ఏ ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జెడ్పిటిసి డిమాండ్.

Share it:



  •  వీఆర్ఏ లకు పదోన్నతులు, పేస్కేల్ వెంటనే అందించాలి ములకలపల్లి :మే 22:మన్యం మనుగడ ప్రతినిధి :మండలం మాదారం గ్రామంలో ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి ఇంటి దగ్గర విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జెడ్పిటిసి సున్నం నాగమణి మాట్లాడుతూ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా నిరసన తెలపడానికి ఛలో సీసీఎల్ఏ ( హైదరాబాద్ )వెళుతున్న వీఆర్ఏలను అక్రమ అరెస్టులు చేయడం,జిల్లాలోనే నిర్బంధించడాన్ని సున్నం నాగమణి తీవ్రంగా ఖండించారు.2020సెప్టెంబరు 9 న అసెంబ్లీలో నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తున్న సందర్భంగా,శాసనసభ సాక్షిగా వీఆర్ఏ లందరికీ పేస్కేల్ అందిస్తామని,అర్హులకు పదోన్నతులు కల్పిస్తామని,తండ్రుల స్థానంలో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వటం జరిగిందని తెలిపారు. వీఆర్ఏలు న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని,వి ఆర్ ఏ లకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని సున్నం నాగమణి డిమాండ్ చేసారు.

Share it:

TS

Post A Comment: