మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం నడిగడ్డ( సీతానగరం) గ్రామంలో ఆదివాసీల జాతరైన కొర్రాజుల కొలుపు జాతర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది 150 సంవత్సరాల పూర్వం ఇప్పటి చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన పూజారి కాంకెడు గ్రామం నుండి నడిగడ్డ ప్రాంతానికి చెందిన అప్పటి కోయదొరలు కొర్రాజుల దేవుడిని తీసుకువచ్హి ఆదివాసి దేవుళ్లను కొలుస్తున్నారు ఈ క్రమంలోనే ప్రతి రెండేళ్లకోసారి ఈ కొర్రాజుల కొలుపు జాతర నిర్వహిస్తున్నారు ప్రధాన పూజారి కొమరం బొజ్జి ఆధ్వర్యంలో జాతర నిర్వహించబడుతూ ఉండగా అందులో భాగంగా ఈ ఏడాది జాతర నిర్వహించడంలో భాగంగా ఆదివారం ఉదయం పందిరి ముహూర్తం వేసి ఆలయ పందిరి ఏర్పాటు చేసిన ఆలయ పూజారులు గ్రామ పెద్దలు సాయంత్రం నాలుగున్నర గంటలకు పవిత్ర గోదావరి నది తీరంలో కొర్రాజు దేవుడి ప్రతిరూపమైన గొడుగుని రెండు జెండాలను గంగా స్నానం సేసి జాతర పూజారులు కొమరం బొజ్జి, పూనెంధర్మయ్య, గౌరారం సాంబశివరావు, పూజలు నిర్వహించగా పెద్దలు గ్రామస్తులు మహిళలు అందరూ నదిలో మునిగి గంగా స్నానం చేసిన అనంతరం మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా కొర్రాజుల గొడుగు జెండాలు వెళుతుండగా సంతానం కోరిన మహిళలు నడిచే దారిలో అడ్డంగా పడుకుని ఉండగా గొడుగులు వాటికి దాటుకుంటూ వెళ్తాయి అనంతరం సమీపంలో ఉన్న ముత్యాలమ్మ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ పూజలందుకుంటూ కొర్రాజుల గొడుగుని జెండాలను ఆలయ పందిరివద్ద ఉంచుతారు గ్రామ గ్రామస్తులు భక్తులు పూజలు నిర్వహించారు అనంతరం సంబరాలు నిర్వహించగా యువకులు, మహిళలు నృత్యాలతో ఆటపాటలతో సందడి చేశారు.
Post A Comment: