మన్యం టీవీ దుమ్ముగూడెం:: దుమ్ముగూడెం మండలంలో లక్ష్మీనగరం సెంటర్లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉన్న అమరజీవి కామ్రేడ్ ఎలమంచి సీతారామయ్య ,గుడ్ల శివరావు ల స్థూపాల వద్ద అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 37 వ వర్ధంతి , అమరజీవి కామ్రేడ్ ఎలమంచి సీతారామయ్య 15 వ వర్ధంతి సందర్భంగా గా వారి యొక్క చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి అనంతరం వర్ధంతి సభ అధ్యక్షులుగా సిపిఎం పార్టీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి కారం పుల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో ముఖ్యఅతిథిగా సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య, ఎలమంచి సీతారామయ్య స్ఫూర్తితో దుమ్ముగూడెం మండలంలో సిపిఎం పార్టీని పూర్వవైభవాన్ని తీసుకొని రావాలని వారి యొక్క వర్ధంతి సభలో పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా అదేవిధంగా అమరజీవి కామ్రేడ్ ఎలమంచిలి సీతారామయ్య భద్రాచలం డివిజన్ లో అనేక కూలి పోరాటాలు వర్గ పోరాటాలు ముందుండి పోరాటాలు చేసేవారని భూ స్వాములు అందరూ ఒక పక్క ఉంటే తను భూస్వామి కుటుంబంలో పుట్టినప్పటికీ ఆదివాసీల కోసం దళితుల కోసం బీసీల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వారి పక్క మాట్లాడేవారని అలాంటి మహానాయకుడు దుమ్ముగూడెం మండలంలో అనేక అభివృద్ధి పనులలో వారి యొక్క కృషి ఉందని గ్రామ గ్రామాన పర్యటనలు చేసి ఎర్ర జెండా ని నిర్వహించినటువంటి మహానేత ఎలమంచి సీతారామయ్య అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవి కుమార్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కోటేశ్వరరావు, ఎలమంచి వంశీకృష్ణ, మర్మం చంద్రయ్య, ఎలమంచి శ్రీనుబాబు, బొల్లి సూర్య చందర్రావు, సోయం వీర్రాజు, వాగే ఖాదర్ బాబు, ప్రసాద్, సాయిరెడ్డి, సోడి రాంబాబు, కల్లూరి దేవి, ఎండి మహమ్మద్ బేగ్, సున్నం నరసింహాచారి, గుడ్ల రామ్మోహన్ రెడ్డి , కుమ్మరికుంట్ల సాంబశివరావు, తేల్లం ధర్మయ్య, బోల్లి సత్యనారాయణ, పెనుబల్లి ప్రసాద్ రమేష్ తదితరులు పాల్గొన్నరు.
Post A Comment: