మన్యం టివి మణుగూరు:
నాలుగు రాష్ట్రాలకు చెందిన జిల్లాల ఎస్పీలు ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నట్లు కొంత విశ్వసనీయ సమాచారం అందింది.శనివారం మండలంలోని సింగరేణి సీటైప్ గెస్ట్ హౌస్లో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాల ఎస్పీలు, సెంట్రల్ డిపార్ట్మెంట్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, ఏఎస్పీలు,సీఐలు,ఎస్సెలు ముఖ్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా స్థాయి ఎస్పీలు మాట్లాడుతూ,తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను అదుపు చేయాలన్న ఉద్దేశ్యంతో వారు మాట్లాడారు. అయితే ఏజెన్సీ గోదావరి పరివాహక ప్రాంతాల్లో మావోయిస్టుల అలజడి లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలని,కింది స్థాయి అధికారులకు సూచించారు. అలాగే గోదావరి తీరాన ఏజెన్సీ గిరిజన వాసులు నిత్యం ఎదురుకొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాలని మాట్లాడారు. ఏజెన్సీ గిరిజన వాసులకు పోలీసులు అండగా ఉండేందుకు చర్యలు ఏ విధంగా చేపట్టాలో కొన్ని ముఖ్యమైన అంశాలు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఏజెన్సీ గోదావరి పరివాహక ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు, అలజడి ఉండకుండా గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారని కొంత సమాచారం.ఏజెన్సీ గిరిజన సమస్యలను తీర్చేందుకు పోలీసులు కసరత్తులు చేస్తున్నారు.ఈ సమావేశంలో నాలుగు జిల్లాల ఎస్పీలు,ఏఎస్పీలు,సీఐలు,ఎస్సెలు,సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారని సమాచారం.
Post A Comment: