మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 7 జూలూరుపాడు మండల కేంద్రంలోని సాయి ఎక్స్ంట్ స్కూల్ నందు గురుకులం హాల్ టిక్సెట్స్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి ఎక్సెలెంట్ ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల విద్యాలయం స్థాపించి పేద విద్యార్థులుకు కార్పోరేట్ విద్యను అందిస్తున్నదని తెలిపారు. పేద విద్యార్థులు బాగా చదవాలనే ఉద్దేశంతో సాయి ఎక్సెలెంట్ నందు గురుకులం సీటు 9వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకమైన కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధంగా ప్రతి సంవత్సరం 150 మంది విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి వివిధ గురుకులాల్లో పంపించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పేద, మధ్య తరగతి కుటుంబ విద్యార్థులకు కోచింగ్ ఇచ్చి పోటీ పరీక్షలకు పంపడం జరుగుతుందని అన్నారు. పరీక్షలు మంచిగా వ్రాసి సీటు సాధించాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీహరి, రాంబాబు, ఉపాధ్యాయులు నబిన, సంధ్య, విజయ, సరిత, శంతమ్మ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: