మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండలం బట్టిగూడెం గ్రామంలో ఈ నెలకు గానూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన రేషన్ బియ్యం కారణంగా అనేక అనారోగ్య సమస్యలు లేవనెత్తడంతో గ్రామంలో యూత్ కమిటీ కొన్ని ఇళ్ళల్లో తనిఖీ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా సరియం భీమ్ బహుజన సమాజ్ పార్టీ దుమ్ముగూడెం మండల కన్వీనర్ మాట్లాడుతూ ఆ రేషన్ బియ్యం చూసి తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యామని, 3 సంవత్సరాలకు సరిపోయేంత బియ్యం/వడ్లు సేకరణ జరిగిందని చెప్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పేదప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం లో ప్లాస్టిక్ బియ్యం ఏంటి అని ప్రశ్నించారు.ఇవి తినడం వల్ల అనేక మందికి కీళ్లనొప్పులు, కడుపునొప్పి వచ్చిందని అనేకమంది చెప్పడం జరిగిందని, పేద ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో ఓడించి తగిన బుద్ధి చెప్తామని గ్రామస్థులు తీవ్రంగా విమర్శించారు. ఆ బియ్యాన్ని తక్షణమే తినడం ఆపాలని గ్రామస్థులను కోరడం జరిగింది. ఇట్టి విషయమై సంబంధిత జిసిసి అధికారిని వివరణ కోరగా అన్ని రేషన్ స్టోర్ లో మంచి రేషన్ సప్లై చేశామని, మిగతా సెంటర్ నుంచి కానీ ఎటువంటి కంప్లీట్ రాలేదని ఇట్టి విషయమే ఎక్కడ లోపం జరిగిందో విచారణ చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యూత్ కమిటీ సభ్యులు జలకం చంటి, శ్రీను, మడకం భారతి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: