గుండాల మే 20(మన్యం మనుగడ) నక్సల్బరీ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతామని న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు పూనెం. రంగన్న అన్నారు. శుక్రవారం మండలం పరిధిలోని కాచన పల్లి గ్రామం సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నక్సల్బరీ ఉద్యమానికి 55 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఖమ్మం జిల్లా కమిటీ నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. యాభై ఐదు వసంతాల లో ఎన్నో ఉద్యమాలు చేసిన ఘన చరిత్ర ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా నాయకులు అటికం శేఖర్, మండల కార్యదర్శి లాజర్, న్యూ డెమోక్రసీ నాయకులు వీరన్న, ఐ ఎఫ్ టి యు నాయకులు రమేష్ , కృష్ణ , చాట్ల రమేష్ , వెనక లక్ష్మీనారాయణ, దామోదర్, పునెం రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: