మన్యం మనుగడ ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్ లో మీ సేవను నిర్వహిస్తున్న నిర్వాహకుడి పై ఏడూళ్ల బయ్యారం పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే పినపాక మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన నాగరత్నం అనే మహిళ గడచిన మార్చి పదో తారీఖున మీసేవ కేంద్రానికి వెళ్లి నిర్వాహకుడు శ్రీను కు పదివేల రూపాయలను ఇచ్చి తన ఖాతాలో జమ చేయమంది. సదరు నిర్వాహకుడు ఆమె ఖాతాలో నగదు జమ చేయకుండానే నకిలీ రసీదును ఇచ్చి ఆమెను పంపించేశాడు.మే 6 వ తారీఖున తన ఖాతాలో గల నగదును తీసుకునేందుకు వచ్చిన ఆమెకు ఖాతాలో నగదు లేదనే విషయం తెలిసింది. మోసం జరిగిందని తెలుసుకున్న ఆమె బ్యాంకు కి వెళ్లి ఆమె ఖాతా కు సంబంధించిన వివరాలతో పత్రాలు సేకరించి, ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి, మీసేవ నిర్వాహకుడిని రిమాండ్ కు తరలిస్తామని ఎస్సై టీవీఆర్ సూరి తెలియజేశారు
Post A Comment: