CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మీ సేవలు మరువలేనివి, నివాళులు అర్పించిన ప్రజాప్రతినిధులు.

Share it:

 


మన్యం మనుగడ వాజేడు:

 ములుగు జిల్లా వాజేడు మండల పంచాయతీ అధికారి లక్ష్మి నర్సింహారావు మృతి పట్ల వాజేడు మండల ప్రజాప్రతినిధులు అధికారులు వివిధ పార్టీల నాయకులు దిగ్బ్రాంతికి గురైయ్యారు, గత నెల లో హార్ట్ ఎటాక్ రావడంతో వరంగల్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేసిన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ సర్జరీ చేసారు. తర్వాత డిస్చార్జ్ చెయ్యడంతో భద్రాచలం లో తన ఇంటికి తీసుకుని వచ్చారు. సోమవారం తెల్లవారుజామున 12:00 గంటలకు మళ్ళీ ఫిట్స్ రావడంతో కుటుంబసభ్యులు 108, కు ఫోన్ చేసారు 108, సిబ్బంది వచ్చి చూడగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.. కుటుంబ సభ్యులు తమ సొంత గ్రామానికి పార్ధీవ దేహాన్ని తరలించారు. వారిది ఖమ్మం జిల్లా కోణిజర్ల మండలం లోని పల్లిపాడు గ్రామంలో కుటుంబ సభ్యులు బంధువులు దహనసంస్కారాలు, నిర్వహించారు. కాగా వాజేడు మండలం లోని ప్రజాప్రతినిధులు, జడ్పీటిసి తల్లడి పుష్పలత ఎం పి పి శ్మామల శారద సర్పంచులు, పూసం నరేష్ జజ్జరి మేనక ఉపసర్పంచ్ గౌరరాపు కోటేశ్వరరావు వాజేడు మండల టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు జె టి వి సత్యనారాయణ, ఎం పి డి ఓ, విజయ డి ఎల్ పి ఓ,దేవరాజు, తాడ్వాయి ఎం పి ఓ గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: