మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా గత రెండు సంవత్సరాల క్రితం బాధ్యతలు చేపట్టి ఎనలేని సేవలందించి కరోన కష్టకాలంలో కూడా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహించి అశ్వరావుపేట, దమ్మపేట మండలాల్లో తన సిబ్బందితో సేవలందించి ప్రజలతో మమేకమై స్నేహపూరితమైన సంబంధాలతో సొంత వ్యక్తిగా మెలిగి కొత్తగూడెం బదిలీపై వెళుతున్న సిఐ బంధం ఉపేంద్ర రావుకి మంగళ వారం జంగారెడ్డి గూడెం రోడ్ లో ని శ్రీరంగ ఫంక్షన్ హాల్ నందు దళిత సంఘాల ఆధ్వర్యంలో కృతజ్ఞత పూరితంగా సన్మాన సభ ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించడం జరిగినది. ఈ సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రెండేళ్ల కాలం నుండి ఆయన చేసిన సేవలను కొనియాడారు మునుపెన్నడూ లేని విధంగా సేవలందించారని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కలపాల శ్రీనివాసరావు, తగరం రాంబాబు, ఆవుల చిన్ని, నార్లపాటి సుదర్శన్ రావు, సొసైటీ డైరెక్టర్ కలపాల బాబురావు, నార్లపాటి చిన్నబ్బాయి, చిప్పన పల్లి శ్రీను, పేరాయి గూడెం రైతు సమన్వయ కమిటీ సభ్యులు కుడుముల రంగారావు, కొలిగిపోగు ధర్మ, తగరం హరి, తగరం శ్రీను, గుర్రాల దుర్గయ్య, రామారావు, లక్ష్మణా రావు, సునీల్, అనిల్, వేణు, సుబ్బారావు, ఆనంద్, రమేష్, వెంకటేష్, ప్రదీప్, సురేష్, జగదీష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: