CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వ్యవసాయ శాఖ ప్రత్యేక ఆహ్వానంతో ఖరీఫ్ సాగు సన్నాహక సమావేశం లో పాల్గొన్న రైతు సమన్వయ సమితి నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

హన్మకొండ జిల్లా హసన్ పర్తి "కిన్ కన్వెన్షన్ సెంటర్ "లో మంగళవారం రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలోనిర్వహించిన వానాకాలం సీజన్ (ఖరీఫ్)వ్యవసాయ సాగు సన్నాహక సమావేశం లో ములుగుజిల్లా మంగపేట మండలం నుంచి పలువురు రైతు సమన్వయ సమితి నాయకులు,సింగిల్ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా ములుగు జిల్లా జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య నేతృత్వంలో మంగపేట సింగిల్ విండో చైర్మన్ తోట రమేష్,వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్, రైతు సమన్వయ సమితీ మండల అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి,సింగిల్ విండో డైరెక్టర్లు పిన్నింటి మధుసూదన్ రెడ్డి, సిద్దంశెట్టి లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు.ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ శాఖ నుంచి వారికి ప్రత్యేక ఆహ్వానం అందడంతో వారంతా ఈసమావేశంకు తరలివెళ్లారు.

Share it:

TS

Post A Comment: