మన్యం మనుగడ కరకగూడెం: మండల పరిధిలోని మోతే గ్రామానికి చెందిన చిర్ర రమేష్ గౌడ్ అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ మృతదేహాన్నికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి ఏ ఆపద వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దొంతు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: