గుండాల మే 27(మన్యం మనుగడ) పెంచిన నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలంటూ వామపక్షాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ప్రదర్శన నిర్వహించి అనంతరం తాసిల్దార్ కిషోర్ కు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం గుండాల ఎంపీపీ భక్తి సత్యం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యావసర వస్తువుల ధరలను భారీగా పెంచిందని సామాన్యులకు ఏమాత్రం అందే పరిస్థితులు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను భారీగా పెంచి కంటితుడుపుగా కొంత తగ్గిందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ధరలు పైపైకి పోతున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రణలోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ సీతారాములు, సిపిఐ మండల కార్యదర్శి రమేష్ , సాయన పల్లి సర్పంచ్ రామ్మూర్తి, ప్రజా పందా నాయకులు శంకర్, న్యూ డెమోక్రసీ నాయకులు రవి, వై వెంకన్న, నరేష్ , పూనెం రంగన్న, ప్రజా పందా నాయకులు పూనెం మంగయ్య, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: