మన్యం మనుగడ వెబ్ డెస్క్:
హైదరాబాదులో అసెంబ్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు గారు ను శుక్రవారం నాడు వారి చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన... బార్ కౌన్సిల్ సభ్యులు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొల్లి సత్యనారాయణ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనుబ్రోలు రాం ప్రసాద్, ఐలు నాయకులు జె.శివరాం ప్రసాద్, రమేష్ కుమార్ మక్కడ్, పోనుగోటి కిషన్ రావు, న్యాయవాది తెల్లబోయిన రమేష్ కొత్తగూడెం జిల్లా కోర్టు భవనాల నిర్మాణానికి 10 ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించటం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా న్యాయవాదులకు ఇళ్ల స్థలాల కోసం మరో 15 ఎకరాలు కేటాయించటానికి కృషి చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన రేగా కాంతారావు ముఖ్యమంత్రికి లేఖ వ్రాసారు.
Post A Comment: