మన్యం మనుగడ కరకగూడెం : రద్దీని బట్టి ట్రాఫిక్ ఆంక్షాలను సరళీకృతం చేస్తామని కరకగూడెం ఎస్ఐ నాగబిక్షం అన్నారు.మండల కేంద్రం నందు ప్రధాన రహదారిలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా అవుతున్నాయని మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి సీతారాంపురం వరకు ప్రధాన రహదారిగా ఉండడంతో వచ్చిపోయే వాహనాలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదని తెలుసుకున్న, కరకగూడెం ఎస్ఐ నాగబిక్షం ప్రధాన రహదారిని పరిశీలించి రహదారి సముదాయంలో ఉన్న షాపు యజమానులతో సమావేశం నిర్వహించి మీ షాపు వద్దకు వచ్చే వాహనదారులకు కస్టమర్లకు తమ తమ వాహనాలను రోడ్డుకు అడ్డంగా పెట్టి రహదారిని నిలిపిన వారికి కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆయన హెచ్చరించారు.రోడ్డు ఇరుపక్కల తోపుడుబండ్ల మీద వ్యాపారం నిర్వహించే వ్యాపారస్తులు ఖాళీ ప్లేస్ లో తమ వ్యాపారాలను కొనసాగించాలని సూచనలు తెలిపారు. నిబంధనలు ఉలంగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ విషయంపై ప్రజలు తనకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Post A Comment: