మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 10 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండలంలోనీ వెంగన్నపాలెం, అనంతారం, గుళ్ళరేవు, బేతాళపాడు గ్రామ పంచాయతీలలో ఏర్పాటుచేసిన నర్సరీలను మంగళవారం జూలూరుపాడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రసాదరావు సందర్శించారు. నర్సరీ లో పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీలలో మొక్కల పెంపకం, పోషణ, సంరక్షణ తదితర అంశాల పైన సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు అటవీశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: