పదో తరగతి పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులందరూ ఒత్తిడి అధిగమించి మానసికంగా మరియు శారీరకంగా పూర్తి గా సన్నద్ధమై పరీక్షలు రాయాలని అందరూ మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కంభంపాటి సురేష్ కుమార్ ఈ మేరకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమం కి. ముఖ్య అతిధి గా విచ్చేసిన ఖంభంపాటి సురేష్ 10 వ తరగతి బాలికలకు పరీక్ష పాడ్స్ మరియు స్టేషనరీ అందజేశారు, అలాగే విద్యార్థులకు సాయంత్రం పూట స్నాక్స్ కూడా వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జెడి ఫౌండేషన్ భాద్యుడు మురళి మోహన్ కుమార్ తెలుపుతూ ఈ అవగాహన కార్యక్రమానికి ఆర్థికంగా సహకారాన్ని అందించిన స్వర్గీయ శ్రీ యాదగిరి మాస్టారు పేరున వారి కుమారుడు జగదీష్ .మరియు శ్రీ సత్యమూర్తి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ బాలికల వసతి గృహ సంక్షేమ అధికారిణి పి. అపర్ణ ఫౌండేషన్ సభ్యులు హన్సి, పవన్ కుమార్. కడాలి నాగరాజు.తదితరులు పాల్గొన్నారు
Post A Comment: