మన్యం మనుగడ, అశ్వారావపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, విద్యార్థులకు అవసరమైన అన్ని హంగులతో ప్రభుత్వ బడులను తయారు చేయడం జరుగుతుందని మండల పరిషత్ ఎంపీపీ శ్రీరామమూర్తి అన్నారు. అశ్వరావుపేట ప్రాథమిక పాఠశాలలో జడ్పిటిసి చిన్నం శెట్టి వరలక్ష్మితో మన ఊరు మన బడి కార్యక్రమం ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు బడిలు యొక్క స్వరూపాన్ని మార్చినట్లు వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని హంగులతో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన అన్నారు. అశ్వరావుపేట ప్రాథమిక పాఠశాలలో 18 లక్షల రూపాయలతో మరమ్మతులు చేస్తున్నామని అన్నారు. జెడ్పిటిసి వరలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ బడిలోనే విలువలతో కూడిన విద్య లభ్యం అవుతుందని సుశిక్షితులైన ఉపాధ్యాయులచే బోధన జరుగుతుందని పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు ఉచితంగా అందిస్తున్నామని ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట పంచాయతీ ఉపసర్పంచ్ కేదార్నాథ్, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షురాలు హసీనా, ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ శ్రీలక్ష్మి, వికేడివిఎస్ కళాశాల ప్రిన్సిపాల్ శేషుబాబు, ఎస్ఎంసి సభ్యులు ఉపాధ్యాయులు నీలావతి, సురేష్, సిఆర్పి ప్రభాకర చార్యులు, విద్యార్దుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: