మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం నర్సింగసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనగ కుంటఆదివాసీ గూడెంలో గురువారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదం లో సుమారు 24 ఇల్లు కాలిపోవడం జరిగింది 40 కుటుంబాల వరకు నిరాశ్రయులయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కెనరా బ్యాంక్ రాజుపేట సిబ్బంది మరియు కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ 1 మరియు కెనరా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ 2 సిబ్బంది నిరాశ్రయులైన బాధితులకు 5 క్వింటాళ్ల రైస్, మరియు 40 కేజీల పప్పు ,40 కేజీల నూనె ప్యాకెట్లు, నిత్యవసర సరుకులు వారికి కెనరా బ్యాంక్ తరఫున అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ అసోసియేషన్ వరంగల్ 1 రీజినల్ సెక్రటరీ రవి కెలోత్, విక్రమ్ మరియు కెనరా బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ వరంగల్ 2 రీజినల్ సెక్రటరీ ప్రసాద్ పసాల, సురేందర్ నాయక్ మరియు కెనరా బ్యాంక్ రాజు పేట సిబ్బంది సీనియర్ మేనేజర్ సురేంద్ర కుమార్ యాదవ్, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ మొగిలి, పూజారి కులసింహ, అనిల్ బొడ్డు, హుస్సేన్, బోలేషావలి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: