- దుప్పట్లు,బట్టలు పంపిణీ
- సంపక్తి భోజనాలు చేసిన ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్,మహబూబాబాద్ ఎంపీ కవిత
మన్యంమనుగడ, మంగపేట.
మంగపేట మండల శనిగకుంట గ్రామంలో 24 ఇండ్లు పూర్తిగా అగ్ని ప్రమాదంలో కాలిపోవడం ఆదివాసీ బిడ్డలు పుట్టెడు దుఃఖంతో ఉన్నారు.మిమ్మల్ని అందరిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం అన్నారు.
32 మందికి ఒక్కరికి 25 వేల రూపాయల చెక్కులను 8లక్షల రూపాయలు ములుగు జిల్లా
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్,ఎంపీ.కవిత అందజేశారు.
ఇండ్లు కాలిపోయిన బాధితులను పరామర్శించారు.
దుప్పట్లు, నిత్యావసరాల వస్తువులు,కట్టు బట్టలను
పంపిణీ చేశారు.
శనిగకుంట ఇండ్లు కాలిపోయిన బాధితులతో కలిసి
జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్,ఎంపీ కవిత సంపక్తి భోజనాలు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ...
ప్రమాద వశాత్తు ఇండ్లు అని కాలి పోయి శనిగకుంట గ్రామస్తులు పుట్టెడు దుఃఖంతో ఉన్నారు.
ప్రభుత్వం తరుపున అందరిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
అందరూ నిరుపేదలు మిమ్మల్ని మీ పరిస్థితి హృదయ విధారకంగా ఉంది.
ముఖ్యమంత్రి కేసీఆర్,కేటీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లి అన్ని రకాలుగా ఆదుకుంటాం.
చదువుకున్న సర్టిఫికెట్లు,భూమి పట్టాదారు పాసు పుస్తకాలను తప్పకుండా ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఇప్పుడు వరకు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమవంతుగా అండగా నిలబడ్డారూ.
ఐటీడీఏ,రెవెన్యూ,పోలీసు అధికారులు సకాలంలో వారికి అండగా ఉన్నారు.
దాతలు తమ వంతుగా సహాయం చేస్తున్నారు.
ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక ధన్యవాదాలు.
ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలి అని పిలుపునిచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్,కేటీఆర్ దృష్టికి తీసుకొని వెళ్లి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని తెలిపారు.
వీరి వెంట జిల్లా నాయకులు
ఆర్డీవో రమాదేవి,ఇటీడీఏ అసిస్టెంట్ పీవో వసంత రావు,స్థానిక ఎమ్మార్వో,
టీఆర్ఎస్ జిల్లా నాయకులు పోరిక గోవింద్ నాయక్,జిల్లా కోప్షన్ సభ్యురాలు వాలియాబీ,రైతు బంధు జిల్లా అధ్యక్షులు పల్లా బుచ్చయ్య,టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, గడదాసు సునీల్ కుమార్,గోవిందరావుపేట ఎంపీపీ సుడి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మ మల్ల రెడ్డి,వత్సవాయి శ్రీధర్ వర్మ,పిఎసియాస్ చైర్మన్ రమేష్,
తాహిర్ పాషా,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: