CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

9న భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయండి.ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొయం కామరాజు పిలుపు...

Share it:


మన్యం టివి దుమ్ముగూడెం::

ఈనెల 9వ తారీఖున భద్రాచలం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ దుమ్మగూడెం మండలంలోని వివిధ గ్రామాల ను సందర్శిస్తూ సింగవరం లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ఆదివాసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామరాజు పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్రం ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో జిఓ నెంబర్ 3 ప్రకారం గా 100% ఉపాధ్యాయ నియామకాలు చేపట్టుటకు తక్షణమే ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ లో తీర్మానం చేయుటకు సమావేశం ఏర్పాటు చేయుటకు, ట్రైబల్ శాసనసభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతూ భద్రాచలం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాన్ని ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ మరియు ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయుటకు పెద్దఎత్తున ఆదివాసి నిరుద్యోగులు, మేధావులు, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ టి ఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి జయబాబు, వాసం ఆదినారాయణ,వర్స వెంకటేష్,వర్స శ్రీరాములు,నూప చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: