గుండాల/ఆళ్లపల్లి మే 8(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ప్రజలు. తాళ్లపల్లి మండలం పరిధిలోని వెంకటాపురం గ్రామం ప్రజలు ఆదివారం రేగా చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆళ్ల పల్లి గ్రామం నుండి వెంకటాపురం గ్రామం వరకు రహదారి నిర్మాణం కోసం 11 కోట్ల 31 లక్షల 84 వేల రూపాయలను మంజూరు చేయించారు. ఏండ్ల తరబడి వేచి చూస్తున్న కలను నెరవేర్చిన రేగా కాంతారావు ఆజన్మాంతం రుణపడి ఉంటామని సర్పంచ్ వజ్ర నరసింహా రావు అన్నారు. వర్షాకాలం వచ్చిందంటే రహదారి గుండా వెళ్లాలంటే నరకయాతన ఉండేదని ఆయన అన్నారు. ప్రభుత్వ విప్ రేగా కు గ్రామపంచాయతీ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కుమారి, మైనార్టీ నాయకులు ఆదాం గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Navigation
Post A Comment: