మన్యం మనుగడ కరకగూడెం: మోటార్ వాహన చట్టంని సవరించాలని ఫిట్నెస్ రెన్యువల్ విషయంలో రోజువారి యాభై రూపాయల ఫైన్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా కరకగూడెం మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోల బంద్ నిర్వహించి మండల కేంద్రంలో ప్రదర్శన ద్వారా నిరసన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు కొమరం కాంతారావు టిఆర్ఎస్ యూత్ నాయకులు గుడ్ల రంజిత్ కుమార్ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటార్ వాహన చట్టం ద్వారా ఆటో కార్మికులు ఆర్థికంగా చితికి పోతున్నారని అసలే కరోణ కాలంలో లాక్ డౌన్ లో ఉపాధి లేక బతుకులు చిత్రమైన తరుణంలో మోటార్ వాహన చట్టం ఆటో కార్మికులకు గుదిబండగా మారిందని వారన్నారు.మోటర్ రంగంలోని స్పేర్ పార్ట్స్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల ద్వారా సాధారణ ఆటో కార్మికుల బ్రతుకులు కేంద్ర ప్రభుత్వ విధానాల ద్వారా అధ్వానంగా మారుతున్నాయని వారు దుయ్యబట్టారు.తద్వారా వెంటనే కేంద్ర ప్రభుత్వం మోటార్ వాహన చట్టంను సవరించి రెన్యువల్ విషయంలో రోజువారీ యాభై రూపాయల ఫైన్ నిబంధనను ఎత్తివేసి పెట్రోల్ డీజిల్ ఆటో స్పేర్ పార్ట్స్ తగ్గించాలని సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని స్థానిక డిప్యూటీ తహశీల్దారు సంధ్య కి వినతి అందజేశారు. రానున్న కాలంలో ఆటో కార్మికుల సమస్యలపై మరిన్ని పోరాటాలు నిర్వహించేందుకు కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కాంపాటి చిట్టిబాబు,యల్లగొండ శీను,గాడిపల్లి సమ్మయ్య, కొలగాని రవి,రావుల వేణు, దాసరి సాంబయ్య,బాదె సాగర్, ముంజాల సురేష్, పోలెబోయిన చందర్రావు, కాటి సాంబ, కణితి రాము, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: