మన్యం టీవీ దుమ్ముగూడెం::
దుమ్ముగూడెం మండలం లోని మారుమూల గ్రామమైన సుజ్ఞానపురం గ్రామంలో ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ శాఖ భద్రాద్రి కొత్తగూడెం సూపర్డెంట్ ఎస్ జానయ్య ఆదేశాల మేరకు అసిస్టెంట్ సూపర్డెంట్ కరంచంద్ తన సిబ్బందితో కలిసి సుజ్ఞానపురం గ్రామంలో దాడులు నిర్వహించారు గత కొంతకాలంగా అక్రమంగా నాటుసారా తయారు చేస్తున్నారని సమాచారం మేరకు 60 మంది సిబ్బందితో దాడులు నిర్వహించారు.ఈ క్రమంలో సారా తయారీ దారులు పరారయ్యారు ఇరువురిని అదుపులోకి తీసుకుని భద్రాచలం ఎక్సైజ్ సీఐ రహీంబేగం వారిని అరెస్ట్ చేశారు. సుమారు మూడు లక్షల విలువ చేసే సారా తయారీకి ఉపయోగించే బెల్లం, పంచదార పానకాన్ని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో అక్రమంగా నాటుసారా తయారుచేసిన అమ్మిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ దాడులు ఎక్సైజ్ అధికారులు నరేందర్ రెడ్డి, రాజశేఖర్, నాగయ్య, రామ్మూర్తి, ఎస్ హెచ్ ఓ సర్వేశ్వరరావు, ఎస్ ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: