CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులను దగా చేస్తున్న బిజెపి ప్రభుత్వం :- కేంద్రానిది ఒక బాట రాష్ట్రానిది మరో బాట :-పొంతనలేని మాటలతో ప్రజలు అయోమయం :-టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్

Share it:

 



గుండాల ఏప్రిల్ 4(మన్యం మనుగడ) రైతులను దగా చేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్ అన్నారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపులో భాగంగా, ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాలనుసారం సోమవారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం ముందు పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వడ్లు కొనేది లేదంటే రాష్ట్రంలోని బిజెపి నాయకులు కేంద్ర వడ్లు కొంటుంది అని ప్రజలను మభ్యపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ది ఒక దారిని రాష్ట్ర నాయకుల ది మరో ధరణి ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నాయకులు జూ టమాటలను మానుకొని రాష్ట్రంలోని వడ్లు కేంద్రం కొనే విధంగా ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, యువజన విభాగం అధ్యక్షులు అజ్జు, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్ , మైనార్టీ నాయకులు సుభాని, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాములు, నాయకులు మోకాళ్ల వీరస్వామి,లాలయ్య , రాము, నాగరాజు, తాటి కృష్ణ , బొమ్మెర శ్రీను, పద్మారావు, పుల్లయ్య , సాంబయ్య , ఈసం సమ్మయ్య , శ్రీకాంత్, రామయ్య , సమ్మయ్య , ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: