మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం సిఐ బంధం ఉపేందర్ రావు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. వినాయకపురం శివారులొ సోమవారం తెల్లవారు జామున రెండు మోటర్ బైక్ లు ఢీకొని ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. జాతర చివరి రోజు సందర్భంగా అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ బంధం ఉపేందర్ రావు ముత్యాలమ్మతల్లి జాతర బందోబస్తు విధుల్లో వున్నారు. జాతర విధి నిర్వహణ భాగంగా వినాయకపురం వచ్చిన సిఐ భంధం ఉపేంద్రరావు కుక్కునూరుకు చెందిన వీరి నిస్సహాయస్థితిని చూసి చలించిపోయిన సీఐ ఉపేందర్ స్వయంగా గాయపడిన ముగ్గురిని అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్యం అందేలా చూశారు. ఆస్పత్రిలో స్వయంగా పరామర్శించి వివరాలు తెలుసుకొన్నారు. ఇక వివరాల్లొకి వెళ్తే వారు వినాయకపురం లొ జరుగుతున్న జాతరకు వచ్చినట్లు తెలుస్తుంది. వారు కుక్కునూరు చెందిన వారుగా పోలీస్ లు తెలిపారు. పోలీస్ గా విధి నిర్వహణ పద్దతిలో కాకుండా, వ్యక్తిగా, మానవత్వంతో సహయపడే ధోరణితో ఆయన ప్రవర్తనను పలువురు ప్రశంశిస్తున్నారు. ఇలా ఎంత పని వత్తిడిలో ఉన్నా మానవత్వాన్ని ప్రదర్శిస్తూ చేసే కొన్ని చర్యలు అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
Post A Comment: