మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని రోహిత్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.గోదావరి స్నానానికి వెళ్ళిన సందీప్ 13 సంవత్సరాలు,బెడిక సతీష్17 సంవత్సరాలు,అకుదారి సాయి వర్ధన్ 17 సంవత్సరాలు శనివారం గోదావరిలో గల్లంతయ్యారు. ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో ఊరు దేవత అయిన లక్ష్మీదేవి గంగ స్నానానికి తీసుకెళ్లి ఉగాది పండుగ కు తీసుకు రావడం అనావతిగా వస్తుంది.గ్రామ ప్రజలందరూ లక్ష్మీదేవి వెంబడి గోదావరికి వెళ్ళిన క్రమంలో ముగ్గురు యువకులు గోదావరిలో ఈతకొడుతూ గల్లంతయ్యారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.విషయం తెలుసుకున్న ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్,ఎస్ఐ రమేష్ తమ పోలీస్ సిబ్బందిని గజ ఈతగాళ్లను గోదావరి ప్రాంతంలోని సంఘటన స్థలానికి చేరుకొని గల్లంతయిన వెతికి తీయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
Post A Comment: