గుండాల/ఆళ్లపల్లి ఏప్రిల్ 2(మన్యం మనుగడ) ఆళ్లపల్లి మండల కేంద్రం సమీపంలో నూతనంగా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు పేరుతో ఒక గ్రామాన్ని టిఆర్ఎస్ పార్టీ నాయకులు,రేగా అభిమానులు గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఆయన రేగా పేరుతో గ్రామం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు అన్నారు. రేగా ఇచ్చే స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతరావు, పార్టీ ప్రధాన కార్యదర్శి బాబా, కోపరేటివ్ చైర్మన్ బ్రహ్మయ్య ,కోపరేటివ్ డైరెక్టర్స్ ఆఫీస్, సాంబశివరావు, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు సతీష్, మైనార్టీ జిల్లా నాయకులు ఆదాం, బుర్ర వెంకన్న, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: