మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు క్లస్టర్ గుండెపుడి రెవిన్యూ పరిధిలోని సూరారం, సాయిరాం తండా, వెంగన్నపాలెం, గుండెపుడి గ్రామాలలో ఏ ఈ ఓ లు నమోదు చేసిన పంటలు సర్వే నెంబర్ల వారీగా నమోదు చేసినారా, లేదా.! ప్రస్తుత పంటలు ఏ సర్వేనెంబర్ లో ఏ ఏ పంటలు ఉన్నాయి అని పై అధికారుల ఆదేశాల మేరకు పర్యవేక్షణ గురించి రైతులను కలిసి పలు రకాల పంటలను సందర్శించారు. యాసంగి లో రైతులు వేసిన పంటలు వరి, పొద్దుతిరుగుడు, పెసర, జొన్న, మొక్కజొన్న, పంటలను సందర్శించి లేటుగా రబీలో వేసిన వరి, పొద్దుతిరుగుడు, పంటలలో తెగుళ్లు, కలుపు నివారణ గురించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు, సలహాలు తెలియజేశారు. తదుపరి రైతులు రాబోయే ఖరీఫ్ సీజన్ కు గాను రైతుబంధు, రైతు బీమా, పీఎం కిసాన్ పథకాలలో రైతులకు ఎవరికైనా డబ్బులు పడకుండా ఆగిన చో ఏ ఈ ఓ లను కలిసి సరి చేయించుకోవాలని, రైతు బీమా చేయించుకొని రైతులు భీమా అయినదా లేదా అని తెలుసుకొని రైతుబంధు పొందే ప్రతి రైతు రైతు బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, ఏ ఈ ఓ గౌస్, వీఆర్ఏలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: