- వై ఎస్ ఆర్ టిపి నియోజక వర్గ నాయకులు పెనుబల్లి రమేష్. ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:
వైయస్సార్ తెలంగాణ పార్టీ నియోజకవర్గ నాయకులు పెనుబల్లి రమేష్ బాబు ఉగాది పండుగను పురస్కరించుకొని మండలం లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటన కందుకూరి రాంబాబు ఆధ్వర్యంలో రింగ్ రెడ్డి పల్లి,మంగళ గుట్ట గ్రామాలను పర్యటించారు.వారి వెంట గ్రామ పెద్దలు,యువకులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విధివిధానాలను షర్మిల చేపట్టబోయే ప్రజా ప్రస్థానం పాదయాత్ర గురించి నియోజకవర్గ నాయకులు రమేష్ బాబు వారికి తెలియజేశారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వారికోసం మన షర్మిలమ్మ చేపట్టబోయే పాదయాత్రకు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కొండల్ రావు,మండల బాధ్యులు కందుకూరి రాంబాబు,మండల నాయకులు కాశీ రామేశ్వరం, గ్రామ నాయకులు వీరస్వామి,రాఘవయ్య, వెంకటేష్, పద్మ,బాబురావు, సీతారాములు,చుక్క రావు,పద్మ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: