- పోలీస్ ఉద్యోగ అబ్యార్ధులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నాము.
- ఆశక్తి కలిగినవారు స్టేషన్ లో తమ పేర్లు నమోదు చేసుకోగలరు-ఎస్ ఐ సురేష్
ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తిమ్మంపేట గ్రామ పంచాయితీ పుట్టతోగు గ్రామంలో ఏర్పాటుచేసిన వాలీబాల్ టోర్నమెంట్ ను స్థానిక ఎస్సై బల్దె సురేష్ ప్రాంభించారు.
ఈసందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.ఆనంతరం సర్వీస్ చేసి ఆటను మొదలు పెట్టారు.ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ గౌరీ లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగించారు.క్రీడలు మానసిక ఉల్లాసానికి,శారీరిక దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయని, క్రీడల మూలంగా స్నేహాభావం పెంపొందుతుందని అన్నారు.ఈ సందర్బంగా టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. చదువుకున్న ప్రతి యువతి,
యువకులు పోలీసు ఉద్యోగాల కోసం విద్యా అర్హతలు కలిగినవారు తమ ధ్రువపత్రాలతో స్థానిక పోలీస్టేషన్ లో సంప్రదించి ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని,పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి తమ శాఖ ఆధ్వర్యంలో ఉచితగా కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గౌరి లక్ష్మీ, ములకలపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పోతుగంటి క్రాంతి, తాండ్ర ప్రభాకర్ రావు,తుర్రం శ్రీనివాసరావు, సున్నం కృష్ణ,కోండ్రు రవి,మడకం సతీష్. క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: