CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వైభవంగా రాములోరి కల్యాణం.కల్యాణానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఏఎస్పి అశోక్ కుమార్.

Share it:


  • అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. 

మన్యం మనుగడ ఏటూరునాగారం

మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం,మండలంలోని రామన్నగూడెం,రొయ్యూరు శ్రీరామ ఆలయాల్లో సీతారాముల కల్యాణాన్ని ఆలయ కమిటీ సభ్యులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఆదివారం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవాన్ని అర్చకులు నాగేశ్వర శర్మ,రామ్మూర్తి శర్మ, హయగ్రీవాచారి,యస్.మురళి మోహన్ శర్మ,ముక్కామల వెంకట నారాయణ శర్మ,రాధాకృష్ణ లు ఘనంగా కల్యాణాన్ని జరిపించారు.కల్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా స్థానిక ఏఎస్పీ అశోక్ కుమార్,ఖమ్మం అడిషనల్ కలెక్టర్ నూతి మధుసూధన్ దంపతులు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి,మొక్కులు చెల్లించుకున్నారు.స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ నాగేశ్వరరావు-శారద దంపతులు స్వామివారి కళ్యాణానికి 1కేజీ 250గ్రాముల గోటి తలంబ్రాలను సమర్పించారు.అర్చకులు నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో నిత్యారాధన,ఆరగింపు, ధ్వజారోహణ,దేవతాహ్వావానము తదితర కార్యక్రమాలను అలువాల శ్రీనివాస్-వీణావాని,ఇర్సవడ్ల భిక్షపతి-సరోజ,సప్పిడి రాము-రోజా దంపతులు,బాలోజు బ్రాహ్మం,మంచోజు వెంకటేశ్వర్లు,కుమ్మరి వెంకటేశ్వర్లు దంపతులు పాల్గొనగా,అర్చకులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.మధ్యాహ్నం 12:05ని.లకు అర్చకుల వేదమంత్రాల నడుమ శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.అంగరంగ వైభవంగా జరిగిన స్వామివారి కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అక్షితలు చల్లి,తీర్థప్రసాదాలు స్వీకరించి,స్వామివారి కృపకు పాత్రులయ్యారు.కార్యక్రమంలో స్థానిక సీఐ కిరణ్ కుమార్,ఎస్సై డి.రమేష్,శివాలయం చైర్మన్ తాడూరి రఘు,ఆలయ మాజీ చైర్మన్ పోగుల లక్ష్మీనారాయణ,ఆలయ కమిటీ చైర్మన్ సప్పిడి రాము,ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, కోశాధికారి అలువాల శ్రీనివాస్,ఇర్సవడ్ల వెంకన్న,రఘు, పర్వతాల లాలయ్య, ఇర్సవడ్ల నాగేశ్వరరావు, చెన్న రాంబాబు, బాల్యే ప్రసాద్,సతీష్,శివ,గొర్ల ప్రసాద్,సివిల్ సిబ్బంది శోభన్,రహీం,నేహా, సీఆర్పీఎఫ్ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: