మన్యం మనుగడ, పినపాక:
ద్వి చక్ర వాహనం అదుపుతప్పి యువకుడు గాయాలపాలైన సంఘటన పినపాక మండలం లోని ఏడూళ్ల బయ్యారం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మణుగూరు మండలం సాంబాయిగూడెం గ్రామానికి చెందిన గండు రాకేష్ అనే యువకుడు బి టి పి ఎస్ లో జెపిఏ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఏడూళ్ల బయ్యారం ఎక్స్ రోడ్ లో నివాసం ఉంటున్న అతడు మధ్యాహ్న సమయంలో బయ్యారం గ్రామంలోకి వెళుతుండగా వాహనం అదుపు తప్పి కింద పడడంతో తలకు దెబ్బ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే దగ్గరలోని పినపాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు కొత్తగూడెం తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది
Post A Comment: