మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ఆడపడుచులు స్వామివారి కళ్యాణ మహోత్సవం వేడుక కన్నులపండువగా నిర్వహించారు. తిరుమలకుంట గ్రామంలో సీతారాముల తరుపున జయవరపు ఫణి కుమార్ దంపతులు, దారా శ్రీనివాసరావు దంపతులు, కక్కిరాల ప్రశాంత్ దంపతులు, అత్తెం నాగు దంపతులు, సంకా నాగబాబు దంపతులు సీతారాముల విగ్రహాలకు కల్యాణం జరిపించారు. ఆడపడుచులు, గ్రామస్థులు భారీగా తరలివచ్చి కల్యాణోత్సవం తిలకించారు. పూజ కార్యక్రమం అనంతరం స్వామి వారి ప్రసాదముతో
పాటు భక్తులకు పానకం ప్రసాదంగా తీసుకోవడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నసంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లకీ ఉత్సవం గురువారం నిర్వహించనున్నట్లు ఆలయ పంతులు రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ భక్తులు కమిటీ సభ్యులు, తెరాస పార్టీ మండల సెక్రటరీ జుజ్జురి వెంకన్నబాబు, ఉపసర్పంచ్ జుజ్జురి రాంబాబు, తెరాస గ్రామ సేఖ అధ్యక్షులు బొల్లుకొండ చెన్నారావు, జుజ్జురి దుర్గారావు, పానుగంటి శ్రీనివాస్, పల్లెల రామలక్మయ్య, జుజ్జురి హరికృష్ణ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post A Comment: