గుండాల ఏప్రిల్ 10(మన్యం మనుగడ) శోభాయమానంగా మండలంలో రాములోరి కళ్యాణం, మండల కేంద్రంతో పాటు మండలంలోని పడుగొని గూడెం, కాచన పల్లి గ్రామాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలోని రామాలయంలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రాములోరి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణ అనంతరం వ్యాపారవేత్త మానాల భద్రయ్య కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కేంద్రంలోని భక్తులతోపాటు వివిధ గ్రామాల భక్తులు హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు
Post A Comment: